రౌడీ హీరోకు జోడీగా సీత

రౌడీ హీరోకు జోడీగా  సీత

‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ ఎంతటి సెన్సేషన్​ క్రియేట్​ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హీరోయిన్ నెక్ట్స్​ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే వరుస ఆఫర్లతో ఈ నటి బిజీగా మారింది. తాజాగా టాలీవుడ్​లో ఓ క్రేజీ ఆఫర్​ను కొట్టేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్​ పరుశురాంతో విజయ్​ దేవరకొండ ఓ కొత్త సినిమాను అనౌన్స్​ చేసిన విషయం తెలిసిందే.

 ‘గీత గోవిందం’ సినిమాకి ఇది సీక్వెల్​ అనే టాక్​ నడుస్తోంది. దిల్​ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దేను  కన్ఫర్మ్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్​లో మృణాల్​ చాన్స్​ కొట్టేసినట్టు తెలుస్తోంది. రేపు ఈ మూవీని హైదరాబాద్ వేదికగా గ్రాండ్​గా లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు పరశురాం పూర్తిస్థాయి లవ్​ స్టోరీగా దీనిని తెరకెక్కిస్తున్నాడట.​ ప్రస్తుతం వైరల్​ అవుతోన్న ఈ వార్త సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.