
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దూసుకుపోతున్నారు. రెండో రౌండ్లోనూ భారీ ఆధిక్యం సాధించారు. ఆల్పాబెటికల్ ఆర్డర్ ప్రకారం 10 రాష్ట్రాల్లో 1138 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో ద్రౌపది ముర్ముకు 1,05,299 విలువైన 809 ఓట్లు వచ్చినట్లు రాజ్యసభ సెక్రటరీ పీసీ మోడీ తెలిపారు. సెకండ్ రౌండ్ లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేవలం 329 ఓట్లు మాత్రమే దక్కాయి. వాటి విలువ 44,276.
After 2nd round, where ballot paper of first 10 states alphabetically counted - total valid votes 1138 & their total value 1,49,575. Out of this, Droupadi Murmu gets 809 votes valued at 1,05,299 & Yashwant Sinha gets 329 votes valued at 44,276: PC Mody, Secretary Gen, Rajya Sabha pic.twitter.com/5y1ZPwxWhs
— ANI (@ANI) July 21, 2022
ఎంపీలు, 10 రాష్ట్రాలతో కలుపుకొని ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల సంఖ్య 1,886 కాగా.. వాటి విలువ 6,73,175. ఆ ఓట్లలో 1,349 ద్రౌపది ముర్ము ఖాతాలో పడ్డాయి. వాటి విలువ 4,83,299. ఇక యశ్వంత్ సిన్హాకు ఇప్పటి వరకు 1,89,876 విలువైన 537 ఓట్లు మాత్రమే పడ్డాయని పీసీ మోడీ ప్రకటించారు.