
లక్నో: టీమిండియా మాచీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ను.. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా నియమించుకుంది. తమ ఫ్రాంచైజీకి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం, క్లిష్ట సమయాల్లో సలహాలను అందించడంలో ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తాడని ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. ‘ఎమ్మెస్కేకు ఆటతో పాటు క్రికెట్ ఆపరేషన్స్పై మంచి అవగాహన, ఎక్స్పీరియెన్స్ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అతను చాలా విజయాలు సాధించాడు. టీమిండియాకు ఆడటం నుంచి మొదలుపెడితే క్రికెట్ అసోసియేషన్ల కార్యకలాపాల్లో అతనికి ఓ ట్రాక్ రికార్డు ఉంది. అతని విలువైన అనుభవం మా సంస్థకు బాగా పనికొస్తుందని నమ్ముతున్నాం’ అని లక్నో పేర్కొంది. సెప్టెంబర్ 2016 నుంచి మార్చి 2020 వరకు బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా పని చేసిన ఎమ్మెస్కే.. ఆంధ్ర క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గానూ పని చేశాడు. ఇండియా తరఫున 6 టెస్ట్లు, 17 వన్డేల్లో వరుసగా 106, 131 రన్స్ చేశాడు.