
ముదిగొండ, వెలుగు : ముదిగొండ జడ్పీహెచ్ఎస్ 1989–90 టెన్త్ బ్యాచ్ స్టూడెంట్స్ 35 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం అదే స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. నాటి గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కమర్తపు కిరణ్, వెంపటి శ్రీను, యలమద్ది శ్రీను, ఇంద్ర కుమార్, మాచర్ల ఉపేందర్, బంక మల్లయ్య, ఎస్కే ఖాసిం, లక్ష్మీరాజ్య, రమాదేవి, భాగ్యయ్య, నక్క నరసింహారావు, పరిపూర్ల చారి, కమర్తపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపురం హైస్కూల్లో.. .
భద్రాచలం : దుమ్ముగూడెం మండలం నర్సాపురం సూదిరెడ్డి నాగిరెడ్డి ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం 2000–-01 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు. తమకు విద్యాబోధించిన గురువులను సన్మానించారు. ముగ్గురు స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.