- తేజస్ రెండో ప్రైవేట్ రైలు స్టార్ట్..
- అహ్మదాబాద్- ముంబై మధ్య జర్నీ
రెండో తేజస్ రైలు జర్నీ మొదలైంది. అహ్మదాబాద్– ముంబై రూట్లో నడిచే తేజస్ రైలును శుక్రవారం రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్భాయి రూపానీలు ప్రారంభించారు. ఇనాగ్యురల్ రన్లో భాగంగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి అహ్మదాబాద్కు ట్రిప్పులు వెళ్లింది తేజస్. ఆదివారం నుంచి రెగ్యులర్గా రైలు పరుగులు పెట్టనుంది. ఒక్క గురువారం తప్ప వారంలో ఆరు రోజులు అది డ్యూటీలో ఉంటుంది. ఇక, దేశంలో ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో రైలిది. సకల సౌకర్యాలతో రైలును తీర్చిదిద్దారు. ఆ ఫొటోలను పీయూష్ గోయల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశ సంప్రదాయానికి తగ్గట్టు సిబ్బంది కట్టుబొట్టు ఉండనుంది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మోడర్న్ లుక్తో పాటు దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా రైలుకు రూపునిచ్చారు. కాఫీ వెండింగ్ మెషీన్లు, బయో టాయిలెట్లు, అవసరమైనప్పుడు నీళ్లు కావాలంటే ఆర్వో మెషీన్లు, ఒక్కో ప్రయాణికుడు తనకు అనుకూలంగా చదువుకునేందుకు రీడింగ్ లైట్లు, మొబైల్ చార్జింగ్ పోర్టులు, సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ టీవీలు, ఆటోమేటిక్ డోర్స్తో పాటు ఎన్నో సౌకర్యాలను ఐఆర్సీటీసీ కల్పిస్తోంది.