కూతుర్ని చంపి పోలీసులకు లొంగిపోయిన తల్లి

కూతుర్ని చంపి పోలీసులకు లొంగిపోయిన తల్లి

ప్రేమిస్తుందని కన్నకూతుర్నే చంపేసింది ఓ తల్లి.  ఈ ఘటన ముంబైలోని పైడోనిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.పి. వాఘేలా (40) ఏళ్ల మహిళ తన కూతురు నిర్మలా అశోక్ వాఘేలా (23) ముంబైలోని పైడోనీలో నివాసముంటుంది. ఇటీవల తన కూతరు నిర్మలా అశోక్ వాఘేలా ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన తల్లి పి.వాఘేలా అతనితో తిరగొద్దని కూతురుకు చెప్పింది. అయినా వినకుండా కూతురు అతనితో ప్రేమ వ్యవహారం నడిపింది.

గత ఆదివారం రాత్రి తల్లీ కూతుళ్లకు ఇదే విషయంపై వాగ్వాదం జరిగింది. అతనితో వెళ్తా అని తల్లితో వాదించింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లేందుకు బ్యాగ్ లో బట్టలు కూడా సర్దుకుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో చున్నీతో కూతురు గొంతు నులిమి చంపేసింది తల్లి. తర్వాత పోలీస్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఆమెపై ఈ ఘటనపై పైడోనీ పోలీసులు ఐపీసీ  సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి