మెదక్​ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు

 మెదక్​ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్​ ఫ్యామిలీ రెస్టారెంట్​లో కిచెన్​అపరిశుభ్రంగా ఉండడం, కూరలు, తినుబండారాలు పాడైపోవడంతో రూ.10 వేల జరిమానా విధించారు. 

ఈ దాడుల్లో ఇన్​చార్జి శానిటరీ ఇనిస్పెక్టర్​నాగరాజు, ఎన్విరాన్​మెంటల్​ఇంజనీర్​ వెంకటేశ్, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.