
నటుడు అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సదన్ లీడ్ రోల్లో ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఫీల్ గుడ్ సాంగ్ను కోటి రిలీజ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘కలలో కలలో..’ అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ పాటలో గోదావరి అందాలు, నేచురల్ లొకేషన్స్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి.