
క్రికెట్లో పరుగుల పంటను పండించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోని రైతుగా మారాడు. ఇదేదో సరదా కోసం చేసిన పని అనుకుంటే పొరపాటే. అతను నిజంగానే పూర్తి స్థాయి రైతుగా మారి.. 43 ఎకరాలలో వివిధ పంటలు పండిస్తున్నాడు. అంతర పంట పద్ధతిలో ఆవాలను సాగు చేస్తున్నాడు. దీంతో పాటు క్యాబేజీ, అల్లం, క్యాప్సికమ్ వంటి అనేక రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు కూడా పండిస్తున్నాడు. ఇటీవల పంటను పరిశీలించేందుకు రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ధోని.. అతని సాగు సలహాదారుడు రోషన్తో కలిసి సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
For More News..
విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం