విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జనవరి 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా 8,9,10 తరగతులకు కచ్చితంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు తమ విధులకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరు కావాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
For More News..