తెలంగాణ ఎలక్షన్స్ ఏపీలోనూ ప్రభావం చూపుతాయి : నాదెండ్ల

తెలంగాణ ఎలక్షన్స్ ఏపీలోనూ ప్రభావం చూపుతాయి : నాదెండ్ల

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి నుండి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కు మద్దతుగా నవంబర్ 26న పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. కేపీహెచ్బీ కాలనీలోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన జనసేన పార్టీ ఐటీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో నాదేండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ఈ ఎన్నికల విజయాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రభావాన్ని చూపుతాయని నాదేండ్ల మనోహర్ చెప్పారు. ప్రతి కార్యకర్త గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.