హ్యాట్సాప్ నాగ చైతన్య అంటున్నారు.. ఎందుకో తెలుసా..

హ్యాట్సాప్ నాగ చైతన్య అంటున్నారు.. ఎందుకో తెలుసా..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తన గొప్పమనసును చాటుకున్నారు. ఓపక్క తన సినిమాల పనుల్లో బిజీగా ఉంటూనే.. సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే సందర్బంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో సమయాన్ని గడిపారు నాగ చైతన్య. ఆ స్పెషన్ డేని వారితో సెలబ్రేట్ చేసుకొని పిల్లల ముఖాల్లో నవ్వులు నిప్పారు. అంతేకాదు.. ఆ పిల్లలకు అవసరమైన మెడికల్ మెటీరియల్, ఫుడ్ అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ నాగ చైతన్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక నాగ చైతన్య చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రెండు ప్రెజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి దూత వెబ్ సిరీస్ కాగా.. రెండోది చందు మొండేటి దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీ. దూత వెబ్ సిరీస్ కు మనం మూవీ ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక చందు మొండేటితో చేస్తున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.