నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో 167కే జాతీయ రహదారికి అవసరమైన కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు త్వరగా పరిహారం చెల్లించాలని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించాలి
ఉప్పునుంతల: అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రాయిచెడ్ లో పాఠశాల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.
యాప్ ద్వారానే యూరియా ఇవ్వాలి
అచ్చంపేట: రైతులకు యాప్ ద్వారానే యూరియా ఇవ్వాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, యూరియా బుక్ చేసుకోవాలన్నారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
