నార్కట్పల్లి, వెలుగు: ప్రతి ఒక్కరూ తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలని నల్గొండ డివిజన్ తపాలా సూపరింటెండెంట్రఘునందస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మాని గ్రామానికి చెందిన కంచాజు వెంకన్న పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఇతడు మరణించడంతో అతడి భార్య లక్ష్మి కి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ పాలసీ ద్వారా చాలా లాభాలు ఉన్నాయన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రవణ్, ఇన్స్పెక్టర్సైదిరెడ్డి, నెమ్మాని తపాలా అధికారి పరమేశ్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
