ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశం

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ4  నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన తల్లి చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని కోరారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ అనుమతి ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం రాధాకిషన్ రావు తల్లి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు కోర్టు అనుమతి నిచ్చింది. రేపు ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైల్ నుంచి కరీంనగర్ కు రాధా కిషన్ రావ్ వెళ్లనున్నారు.