
తొమ్మిదేళ్ల క్రితం ‘ప్రతినిధి’ అనే పొలిటికల్ థ్రిల్లర్తో ఆకట్టుకున్న నారా రోహిత్ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్లో కొంత బ్రేక్ తీసుకున్న రోహిత్ ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ప్రతినిధి2’ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
నారా రోహిత్పై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం పెద్ద స్పాన్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్నాడు నారా రోహిత్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. నారా రోహిత్కి ఇది 19వ చిత్రం. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.