టాలీవుడ్లో ఇటీవల రీ రిలీజ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా స్టార్ హీరోల బర్త్డేలకు తమ సినిమాలను రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ని జోష్లో నింపుతున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఆ లిస్టులో చేరుతున్నారు. డిసెంబర్ 13న ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. వారందరికీ ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్లో విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రియమణి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కార్తీక్ రత్నం కీలక పాత్ర పోషించాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మణిశర్మ సంగీతం అందించారు.