బీఆర్ఎస్​కు సర్పంచ్  కృష్ణ రాజీనామా

బీఆర్ఎస్​కు సర్పంచ్  కృష్ణ రాజీనామా

మదనాపురం, వెలుగు: రైతు సమితి మదనాపురం మండల అధ్యక్షుడు బక్షి హనుమాన్ రావు, నరసింగాపురం సర్పంచ్  కృష్ణ ఆదివారం బీఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేశారు. దేవరకద్రలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్  పార్టీలో ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు నాగన్న, నాయకులు జగదీశ్, గోపి స్వామి పాల్గొన్నారు.