నామినేషన్లను ‘టీ పోల్’లో అప్లోడ్ చేయండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నామినేషన్లను ‘టీ పోల్’లో అప్లోడ్ చేయండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మద్దూరు, వెలుగు: మద్దూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం పలు నామినేషన్​సెంటర్లను పరిశీలించారు. తెలుగుతోపాటు ఇంగ్లిష్  భాషలో ఉన్న నామినేషన్​పత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ  పోల్ యాప్ లో అప్​లోడ్ చేయించాలని కమిషనర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి   

కోస్గి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కోస్గి మున్సిపల్ ఆఫీస్​ను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు. బ్యాలెట్​బాక్సులను పరిశీలించారు. అనంతరం పీఏసీఎస్​కార్యాలయానికి వెళ్లి, యూరియా కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. డీఏవో జాన్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏవో రామకృష్ణ తదితరులున్నారు. 

పెబ్బేరు, వెలుగు: నామినేషన్ల డీటైల్స్​ను ఎప్పటికప్పుడు టీ పోల్​ వెబ్​సైట్​లో అప్​లోడ్  చేయాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు.

గురువారం పెబ్బేరు మున్సిపాలిటీలో నామినేషన్​ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ అంశాలపై సూచనలు చేశారు. అడిషనల్​ కలెక్టర్​ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్​ మురళీ గౌడ్, ఎంపీడీవో వెంకటేశ్, కమిషనర్​ ఖాజా ఆరీఫుద్దీన్  పాల్గొన్నారు.