ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్  సిక్తా పట్నాయక్

కోస్గి, వెలుగు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, ఆపరేషన్  థియేటర్, ఎక్స్ రే రూమ్ ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

 అవసరమైన మెడిసిన్స్​ కోసం ఇండెంట్  పంపించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్కూల్​ను పరిశీలించారు. రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్  కమిషనర్  నాగరాజ్, తహసీల్దార్  బక్క శ్రీనివాస్, మున్సిపల్  ఏఈ జ్ఞానేశ్వర్  పాల్గొన్నారు.