
నర్సాపూర్ జి, వెలుగు: చనిపోయిన మిత్రుడి కుటుంబానికి చేయూతగా నిలిచారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని గొల్లమాడకు చెందిన దేహొళ్ల శంకర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. దీంతో శంకర్తో కలిసి బెల్లంపల్లి గురుకులంలో టెన్త్చదివిన 1998–99 బ్యాచ్ మిత్రులంతా విరాళాలు సేకరించారు. రూ. 70 వేలు పోగుచేసి శంకర్ భార్యకు బుధవారం అందజేశారు. భవిష్యత్లోనూ అతడి భార్యాపిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. సహాయం అందజేసిన వారిలో సత్యనారాయణ, తోట లక్ష్మణ్, ఎంపీటీసీ సురేశ్, ఎల్ఐసీ లక్ష్మణ్, పంతుల సుభాష్, శేఖర్, భాస్కర్, పోశెట్టి, గంగాధర్ తదితరులున్నారు.