కొల్లూర్‌‌ డీపీఎస్‌లో నేషనల్‌ ఆర్చరీ పోటీలు ప్రారంభం

కొల్లూర్‌‌ డీపీఎస్‌లో నేషనల్‌ ఆర్చరీ పోటీలు ప్రారంభం

రామచంద్రాపురం, వెలుగు : తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌‌ ఢిల్లీ పబ్లిక్​స్కూల్‌లో నేషనల్​ ఆర్చరీ ఛాంపియన్​షిప్​ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను డీపీఎస్​ అసోపియేషన్ జాయింట్ డైరెక్టర్ డోలీ చాన ముఖ్య​అతిథిగా హాజరై ప్రారంభించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు జమ్మూ, బెంగళూరు, హరిద్వార్‌‌, నవీ ముంబయి, అమృత్​సర్​, గయ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. కొల్లూర్​ బ్రాంచ్​ చైర్మన్​ తూమ్​ భీంసేన్​, సెక్రటరీ ప్రణయ కుమార్, తూమ్​ పవన్​ కళ్యాణ్, ప్రిన్సిపల్​ సీజే వసంత  పాల్గొన్నారు.