ఎన్సీసీటీలో 2.21 లక్షల మందికి శిక్షణ

ఎన్సీసీటీలో 2.21 లక్షల మందికి శిక్షణ

హైదరాబాద్​, వెలుగు: నేషనల్ కౌన్సిల్ ఫర్ కో–ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్​సీసీటీ), సహకార సంఘాలకు నైపుణ్యం,  సాధికారత కల్పించడానికి 2023-–24లో దేశవ్యాప్తంగా 3,619 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో 2.21 లక్షల మంది పాల్గొన్నారు.  చేనేత, ఫుడ్​ప్రాసెసింగ్, డెయిరీ వ్యాపారాల వంటి వాటివి సహకార రంగ సంస్థలు అంటారు.  భారత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలలో అవగాహనను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నామని ఎన్​సీసీటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో  70,169 (31.68 శాతం) మంది మహిళలు ఉన్నారు.   2023-–24 సంవత్సరంలో, ఎన్​సీసీటీ,  దాని శిక్షణా విభాగాలు అనేక కొత్త అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ  జాతీయ సంస్థలు,  విశ్వవిద్యాలయాలు,  పరిశ్రమలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి.