- భారతదేశంలో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (ఐఆర్ఎస్) వ్యవస్థ మొదటిసారిగా 1998లో ఐఆర్ఎస్–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభించబడింది.
- ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని తెలుసుకోవడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారు.
- రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రిజల్యూషన్ శక్తి.
- రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడటాన్ని రిజల్యూషన్ శక్తి అంటారు.
- రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లోని సెన్సర్లు సేకరించిన సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు పంపిస్తారు.
- నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది.
- రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నేషనల్ నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహిస్తుంది.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వాతావరణ సమాచార సేకరణకు, విపత్తుల నిర్వహణకు, రవాణా వ్యవస్థ మెరుగుదలకు ఉపరితల చిత్రీకరణకు ఉపయోగిస్తారు.
- ఈ ఉపగ్రహాలను 500 నుంచి 1500 కి.మీ.ల సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి పీఎస్ఎల్వీ నౌకలను ఉపయోగిస్తారు.
- మన దేశంలోని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో ఉపయోగిస్తున్న సెన్సర్లు, స్కానర్లు లీనియల్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్, అడ్వాన్స్డ్ వైడ్ఫీల్డ్ సెన్సార్స్, మాడ్యులర్ ఆప్టో ఎలక్ట్రానిక్ స్కానర్, ఓసియన్ కల్ మానిటర్, ప్రాక్రోమాటిక్ కెమెరా.
అనువర్తనాలు
- పంట విస్తీర్ణం ఆధారంగా పంట కోసే ముందే దిగుబడిని అంచనా వేసే క్రాప్ యావరేజ్ అండ్ ప్రొడక్షన్ ఎస్టిమేట్ (సీఏపీఈ) కార్యక్రమాన్ని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సహాయంతో ఇస్రో నిర్వహిస్తుంది. దీని ఆధారంగా భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, తొమ్మిది రాష్ట్రాల్లో నూనెగింజలు, ఐదు రాష్ట్రాల్లో పత్తి దిగుబడిని అంచనా వేస్తున్నారు.
- కేంద్ర ప్రభుత్వం పంట కోతకు ముందు దిగుబడిని అంచనా వేసే ఎఫ్ఏఎస్ఏల్ కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహిస్తోంది.
- ఐఆర్ఎస్ ఉపగ్రహాల ద్వారా నేలల సారవంతం, ఏ సమయంలో ఎలాంటి పంటలు వేయాలి, చీడపీడల వ్యాప్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు.
- ఏ ప్రదేశంలో ఎంత అటవీ విస్తీర్ణం ఉన్నది, రిజర్వాయర్లలో నీటి మట్టం, జీవ వైవిధ్యం ఉనికికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
- బంజరు భూముల పునరుద్ధరణకు కార్యక్రమాలను పరిశీలించడానికి ఐఆర్ఎస్ ఉపయోగపడుతుంది. 1986లో బంజరు భూముల మ్యాపింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- చేపల సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించే కార్యక్రమాన్ని 1993లో ప్రారంభించారు.
ఇన్శాట్
- ఇండియన్ నేషనల్ శాటిలైట్(ఇన్శాట్) ఉపగ్రహాలను జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా జియో స్టేషనరీ ఆర్బిట్ కక్ష్యలో ప్రవేశ పెడుతారు.
- భారతదేశంలో ఇన్శాట్ వ్యవస్థ 1982 ఏప్రిల్ 10న ఇన్శాట్ –1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభమైంది.
- ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియేన నౌకల ద్వారా కొన్ని ఇన్శాట్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
అనువర్తనాలు
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 620 ప్రధాన టెలికమ్యూనికేషన్స్ టెర్మినల్స్ ద్వారా మొబైల్, ల్యాండ్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- ఇన్శాట్ ఉపగ్రహాల కారణంగా మనకు ప్రస్తుతం 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- టెలిమెడిసిన్ సేవల కోసం ఇన్శాట్ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.
- భూ ఉపరితల సమాచార వ్యవస్థను ఇన్శాట్ ఉపగ్రహం సహాయంతో ఇస్రో అభివృద్ధి చేసింది.
- కల్పనా –1 అనే ఇన్శాట్ ఉపగ్రహం అందించే వాతావరణ సమాచారాన్ని ఇండియన్ మెటియలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ విశ్లేషిస్తుంది. దీనివల్ల తుపానులు, వరదులు, ఉపరితల ఉష్ణోగ్రత మొదలైన అంశాల సమాచారం అందుతుంది.
- ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ రిజర్వేషన్, ఏటీఎం వంటి సేవలను ఇన్శాట్ ఉపగ్రహాలు అందిస్తున్నాయి.
- ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్య కార్యక్రమాలను ఇన్శాట్ ఉపగ్రహాల ద్వారా సఫలీకృతం అవుతున్నాయి.