- వేర్వేరు చోట్ల ఏడుగురు అరెస్ట్
భద్రాచలం, వెలుగు : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం నిర్వహించిన దేశవ్యాప్త బంద్ప్రశాంతంగా ముగిసింది. దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించడంలో భద్రతాబలగాలు విజయవంతం అయ్యాయి. ఆంధ్రా, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించి నిఘాను పెంచారు. డామినేషన్టీంలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి.
నైమేడ్పోలీస్స్టేషన్పరిధి కండకా-జాపేలీ అడవుల్లో 210 కోబ్రా బలగాలు కూంబింగ్చేస్తుండగా ఐదుగురు, భూపాలపట్నం పోలీస్స్టేషన్పరిధి మట్టిమరక శివారులో మొబైల్చెకింగ్పార్టీకి ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. టిఫిన్ బాక్సు బాంబులు, డిటొనేటర్లు, కార్డెక్స్ వైరు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా, -తెలంగాణ బార్డర్ లోని భద్రాచలం – -చింతూరు రూట్ లో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. రాత్రి వేళ చత్తీస్గఢ్, ఒడిశా, ఏపీలకు భద్రాచలం నుంచి బస్సులను బంద్ పెట్టారు.
