కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రాజం పేట మండలం బసన్నపల్లి శివారులోని బసవేశ్వరుని గుట్టకు దక్షిణం వైపు లావా పొరల నడుమ నత్తగుల్ల శిలాజాలు ఉన్నట్లు గుర్తించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్, కొత్త తెలంగాణ చరిత్ర టీమ్ మెంబర్ డాక్టర్ వి. శంకర్, ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, భూగర్భ జల జిల్లా ఆఫీసర్సతీశ్యాదవ్, ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్ రమేశ్మాట్లాడుతూ దక్కన్ ద్వీపకల్పంలో విస్పోటనంతో ఏర్పడ్డ లావా పొరల మధ్య ఈ ఇన్ఫ్రా ట్రాఫియన్ చెర్ట్ అవక్షేపాలు ఉన్నాయన్నారు. 6.5 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడి ఉంటాయన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర టీమ్ కన్వీనర్శ్రీరామోజు హరగోపాల్, భూగర్బ శాస్ర్తవేత్త, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్డిప్యూటీ డైరెక్టర్చకిలం వేణుగోపాల్రావు గ్యాస్ట్రో పోడ్ శిలాజాలుగా గుర్తించారని శంకర్ తెలిపారు.
