హైదరాబాద్, వెలుగు: పరిగి నియోజకవర్గం దామగుండం ఫారెస్ట్ ఏరియాలో ఇండియన్ నేవీ ప్రాజెక్టుకు చెందిన ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనులు ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో సీఎంను నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి కలిశారు. రాడార్ స్టేషన్ గురించి సీఎంకు నేవీ కమండర్ కార్తిక్ శంకర్ వివరించారు.
నావికా దళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకొని త్వరలో వర్క్ స్టార్ట్ చేయాలని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని సీఎం ఆదేశించారు.