
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) 2023 సంవత్సరానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ/ ఎంఎస్/ పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.4250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3250 చెల్లించాలి. పరీక్ష మార్చి 5న నిర్వహిస్తారు. వివరాలకు www.natboard.edu.in వెబ్సైట్ చూడాలి