కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం ఎన్ సీసీ సెలబ్రేషన్స్ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ సీసీ ద్వారా కేడెట్లలో దేశభక్తితోపాటు సేవానిరతి, అంకితభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.
జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కేడెట్ల డ్యాన్స్లు అలరించాయి. కెప్టెన్ కిరణ్ జ్యోతి, ఏసీవో సంపత్ కుమార్, ఏవో శ్రవణ్ కుమార్, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.
