- ఈ ఏడాది దేనికి ప్రాధాన్యం?.. నిధులు ఎవరికి.. కోత దేనికి
- పన్ను పోటు తగ్గనుందా లేదా?
- పార్లమెంట్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోడీ సర్కారు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి వార్షి క బడ్జెట్ కావడంతో అందర్లోనూ అంచనాలు పెరిగాయి. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ప్రభుత్వం , ఏ రంగానికి ప్రాధాన్యమివ్వనుంది? ఆదాయపన్నులో మధ్యతరగతికి ఎలాంటి ఉపశమనం లభించనుందనే ప్రశ్నల నేపథ్యంలో.. గత ఐదేళ్లలో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లు , కేటాయింపుల వివరాల పరిశీలన..
పీఎం కిసాన్ యోజన (2019-20 ఇంటీరిమ్)
రైతులకు దన్నుగా, మధ్యతరగతికి పన్నుల భారం నుంచి ఉపశమనం కలిగించేలా మంత్రి పీయూష్గోయెల్ ఫిబ్రవరిలో ఈ ఇంటీరిమ్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం మధ్యతరగతికి పన్ను భారం తగ్గించడమేనని ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఆదాయపన్నులో మార్పులుచేసి ప్రభుత్వం పన్ను భారాన్ని కాస్త తగ్గించింది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే క్రమంలో ఏటా ఆదాయ పథకంలో రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్చేయనున్నట్లు ప్రకటించింది. చిన్న రైతులకు అండగా ఉండేందుకు పీఎం కిసాన్స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద రైతులకు ఏటా రూ.6 వేలు అందించనున్నట్లు పేర్కొంది. అనార్గనైజ్డ్రంగంలోని కార్మికులకు పెన్షన్స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇన్ కంటాక్స్ రిబేట్ ను రూ.5 లక్షల వరకు పెంపు, ఆయుష్మాన్ భారత్ స్కీం కు రూ.6 వేల కోట్లకు పైగా కేటాయింపులు
ఆర్గానిక్ సాగుకు ప్రోత్సాహం (2018-19)
వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా ఫోకస్చేస్తూ రూపొందించిన బడ్జెట్ఇది. ఎన్డీయే ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్.. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ప్రవేశ పెడుతూ ఆర్గానిక్సాగును ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కనీస మద్దతు ధర పెంపు, వ్యవసాయ మార్కెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ఫండ్కు రూ.2వేల కోట్లు కేటాయింపు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రమోట్చేసేందుకు ఆపరేషన్గ్రీన్పేరుతో ఫండ్ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించింది. సమగ్ర గ్రామీణాభివృద్ధి, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బలోపేతానికి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. పలు ఉత్పత్తులపై దిగుమతి, కస్టమ్స్పన్నులను పెంచింది. ఇన్కం టాక్స్స్లాబ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సీనియర్సిటిజన్లకు కొంత ఉపశమనం కలిగించినా.. అరవై ఏళ్ల లోపున్న వారికి ఆదాయపన్ను ఎలాంటి రిబేట్కల్పించలేదు. నేషనల్హెల్త్ప్రొటెక్షన్స్కీం కింద 10 కోట్ల బలహీన కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించింది.
వ్యవసాయ మార్కెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ఫండ్కు రూ.2 వేల కోట్ల కేటాయింపు, 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా
బ్యాంకుల రీకాపిటలైజేషన్ (2016–17)
ఎన్డీఏ సర్కారు పాలనలో మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన మూడో వార్షిక బడ్జెట్.. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.35,984 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్లో బ్యాంకులకూ తగిన ప్రాధాన్యం దక్కింది. పబ్లిక్సెక్టార్లోని బ్యాంకుల రీకాపిటలైజేషన్కోసం రూ.25 వేల కోట్లు కేటాయించింది. ముద్ర స్కీం కింద రుణ పంపిణీ టార్గెట్ను రూ.1,80,000 కోట్లకు పెంచింది. రోడ్లకు రూ.27 వేల కోట్లు, హైవేలకు రూ.55 వేల కోట్లతో మొత్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్రంగానికి రూ.2,21,246 కోట్లు కేటాయించింది.
ముద్ర రుణాల పంపిణీ టార్గెట్ రూ.1.80 లక్షల కోట్లకు పెంపు
రైతు రుణాలకు వడ్డీ మాఫీ (2017-18)
నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్.. సాగు, ఆరోగ్యం సహా పది అంశాలపై ఫోకస్. రైతు రుణాల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయింపు, రుణం తీసుకున్న ప్రతీ రైతుకు వడ్డీ మాఫీ అమలు, నాబార్డ్ఫండ్రూ.40 వేల కోట్లకు పెంపు, మైక్రో ఇరిగేషన్కు రూ.5 వేల కోట్ల కార్పస్ఫండ్ఏర్పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టిసారించింది. మిషన్అంత్యోదయ, ఉపాధి హామీ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులతో పాటు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్యోజన, ప్రధాన మంత్రి ఆవాస్యోజనకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు వెచ్చించింది. రవాణా రంగంలోని వివిధ సెక్టార్లకు రూ.2 లక్షల కోట్లు, రైల్వేకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించింది.
ఇన్కం టాక్స్లో 2.5 నుంచి 5 లక్షల స్లాబ్కు గతంలో ఉన్న 10 శాతం ఉన్న టాక్స్ రేట్ ను 5 శాతానికి తగ్గించడం
డిజిటల్ ఇండియా దిశగా (2014-15)
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్.. ఇన్కం టాక్స్లిమిట్ను రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంపు, సీనియర్సిటిజన్లకు రూ.3 లక్షల వరకు మినహాయింపు. పీపీఎఫ్లో పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు మినహాయింపును కల్పించింది. 100 స్మార్ట్సిటీలకు రూ.7 వేల కోట్లు కేటాయించింది. డిజిటల్ఇండియా ఇనిషియేటివ్కింద గ్రామీణ స్థాయిలో బ్రాడ్బ్యాండ్కనెక్షన్కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రస్తావించింది. గ్రామీణ ఉద్యోగులకు ఐటీ ట్రైనింగ్ కోసం నిధుల కేటాయింపు.. గంగా నదీ ప్రక్షాళన కోసం ‘నమామి గంగే’ స్కీం ప్రవేశపెట్టి రూ.2 వేల కోట్లు కేటాయించింది. పబ్లిక్సెక్టార్లోని బ్యాంకుల రీకాపిటలైజేషన్కోసం రూ.11,200 కోట్లు కేటాయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం 49 శాతానికి పెంచింది.
వంద స్మార్ట్సిటీలకు రూ.7 వేల కోట్ల కేటాయింపు. నమామి గంగే స్కీంకు రూ.2 వేల కోట్లు
అటల్ పెన్షన్ యోజన (2015–16)
రాష్ట్రాల సాధికారత, కో ఆపరేటివ్ఫెడరలిజంను ప్రోత్సహించే దిశగా ఫోకస్చేసిన బడ్జెట్.. ఇందులో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపైన దృష్టి కేంద్రీకరించింది. అనార్గనైజ్డ్రంగంలోని కార్మికుల కోసం అటల్పెన్షన్యోజన పథకం ప్రవేశపెట్టి, నిధులను కేటాయించింది. అరవై ఏళ్లు దాటిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్చెల్లించేందుకు దీనిని తీసుకొచ్చింది. ఉద్యోగ కల్పన, అభివృద్ధికి మేక్ఇన్ ఇండియా స్కీం, ముద్ర స్కీం ద్వారా చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహించింది. దేశీయంగా ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి, ఉద్యోగ కల్పన, బ్లాక్మనీని అరికట్టడంపై ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఫోకస్పెట్టింది.
బ్లాక్మనీని అణిచివేత, ఉద్యోగ కల్పన, దేశీయ ఉత్పాదకతను ప్రోత్సహించడం