పట్నా : వర్షాలు తగ్గినా పాట్నాలో వరదలు మాత్రం తగ్గడం లేదు. చాలా కాలనీలు ఇంక నీళ్లలోనే ఉన్నాయి. మోకాలి లోతు నీళ్లు అలాగే ఉండడంతో జనం తీవ్ర అవస్తలు పడుతున్నారు. రోజువారీ పనులు నిలిచిపోయాయి. పునరావాస కేంద్రాల్లోనే జనం తలదాచుకుంటున్నారు. అక్కడకక్కడ మిగిలిపోయిన వారి కోసం ఆహార పొట్లాలు అందిస్తున్నారు.
మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నా పరిస్థితి కంట్రోల్ కావడం లేదు. పాటలీపుత్ర నగర్, రాజేంద్రనగర్ ఏరియాల్లో నీళ్లలో జనం ఇబ్బందులు పడుతున్నారు. కోల్ ఇండియా నుంచి తీసుకొచ్చిన మోటార్ సరిగా పని చేయకపోవడంతో ఇబ్బందులు కంటిన్యూ అయ్యాయి.
Bihar: National Disaster Response Force (NDRF) teams continue rescue operation in the flood-affected areas of Patna. #BiharFloods pic.twitter.com/8yxgLvBKmV
— ANI (@ANI) October 4, 2019