
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతోంది. దీని వల్ల ఉద్యోగాలు దొరకడం లేదు. డిగ్రీలు, పీజీలు , బీటెక్ లు చదివి కూడా పట్టా చేత పట్టుకుని తిరుగుతున్నారు నిరుద్యోగులు. ఇక ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న ఉద్యోగానికైనా సరే లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. దీనిని బట్టి చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత డిమాండ్ ఉందనేది.. కర్ణాటకలోని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో 310 పోస్టులకు దాదాపు 2 లక్షల మంది అప్లై చేయడమే ఇందుకు చిన్న ఎగ్జాంపుల్.
కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఖాళీగా ఉన్న 310 అటవి పరిశీలకుల పోస్టుల కోసం 2022- 23లో లక్షా 94 వేల 7 దరఖాస్తులను స్వీకరించింది. టెన్త్ పాస్ తో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులను పరిగణలోకి తీసుకుని దాదాపు 267 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 3న ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చింది. అయితే ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇటీవలే కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ ముందుకొచ్చింది.22 వేల కోట్లతో 40 వేల ఉద్యోగాల లక్ష్యంతో మొబైల్ ఫోన్ అసెంబ్లీ ఫ్లాంట్ ను ఏర్పాటు చేసేందుక ఒప్పుకుంది