బుడాపెస్ట్: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తనను ఊరిస్తున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ గోల్డ్ మెడల్తో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో సింగిల్ త్రో వేసి ఫైనల్తో పాటు ఒలింపిక్ బెర్తు దక్కించుకున్న చోప్రా ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో నీరజ్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు.
గత ఎడిషన్లో సిల్వర్ నెగ్గిన ఇండియా స్టార్ శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్–ఎలో తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్లతో టాప్ ప్లేస్ సాధించాడు. ఈ సీజన్లో అతనికిదే బెస్ట్ కాగా.. కెరీర్లో నాలుగో బెస్ట్ త్రో కావడం గమనార్హం. 25 ఏండ్ల నీరజ్ టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్తో పాటు ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లోనూ బంగారు పతకాలు సాధించాడు.
గతేడాది డైమండ్ లీగ్ చాంపియన్గానూ నిలిచాడు. ఫైనల్కు అర్హత సాధించిన డీపీ మను, కిశోర్ జెనా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జులియన్ వెబర్ నుంచి నీరజ్కు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.