హైదరాబాద్, వెలుగు : ఐఎస్పీ, ఐటీఈఎస్ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెట్లింక్స్ లిమిటెడ్ క్యూ1 నికర లాభం 26 రెట్లు పెరిగి రూ. 1.65 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే రెవెన్యూ కూడా డబులై రూ. 4.66 కోట్లయింది. కిందటి ఫైనాన్షియల్ ఇయర్ మూడో క్వార్టర్లో దక్కించుకున్న రూ. 11.20 కోట్ల కాంట్రాక్టు రెవెన్యూ కొనసాగుతోందని, బోనస్ షేర్ల జారీ ప్రక్రియ ఏప్రిల్ 25 నాడు పూర్తయిందని నెట్లింక్స్ ఎండీ మనోహర్ లోకారెడ్డి చెప్పారు. ఖర్చులు తగ్గించుకుని కంపెనీని మరింత లాభదాయకంగా మార్చుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. షేర్హోల్డర్లకు లాంగ్టర్మ్లో మరింత వాల్యూ క్రియేట్ చేసే దిశలో పనిచేస్తున్నామని చెప్పారు. దేశపు ఎకానమీ వేగంగా ఎదుగుతున్న క్రమంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ సాధించగలుగుతామనే ధీమాను మనోహర్ వ్యక్తం చేశారు.
గంటలోనే 3 వేల బుకింగ్స్
ఓలా ఎలక్ట్రిక్ తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఎయిర్ అమ్మకాలను మొదలుపెట్టింది. గురువారం అమ్మకాలను ఆరంభించిన గంటలోనే 3,000లకుపైగా యూనిట్లు బుక్ అయ్యాయని కంపెనీ పేర్కొంది. ఎస్1 ఎయిర్ను ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్లకు రూ.1.09 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అమ్ముతారు. మిగతావాళ్లు అదనంగా రూ.10 వేలు చెల్లించాలి.