
న్యూఢిల్లీ: టెక్ కంపెనీ గూగుల్ ఏఐ టెక్నాలజీలో మరో ముందడుగు వేసింది. కంప్యూటర్ స్క్రీన్పై మనిషిలాగే పనులు చేయగలిగే కొత్త ఏఐ మోడల్ను జెమినీ 2.5 కంప్యూటర్ యూజ్ పేరుతో విడుదల చేసింది. ఇదిబ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించగలదు.
ఫారమ్లను నింపడం, సబ్మిట్ చేయడం లాంటి పనులను చేయగలదు. క్లిక్ చేయడం, టైపింగ్ చేయడం, పేజీలను స్క్రోల్ చేయడం, కీబోర్డ్ కాంబినేషన్లను ఉపయోగించడం లాంటి పనులనూ చేస్తుంది.
ఇందుకోసం ఇది మొదట స్క్రీన్షాట్ను తీసుకుంటుంది. దాంట్లోని విజువల్స్ను అర్థం చేసుకొని, యూజర్ కోరిన పనిని పూర్తి చేయడానికి ఏది సరైనదో నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాతే మౌస్ క్లిక్లు, కీబోర్డ్ ఇన్పుట్లను జనరేట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇది డెవలపర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది.