- 1,891 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: 2024 లో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్కు కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో న్యాయ మంత్రిత్వ శాఖకు పోల్ ప్యానెల్ ద్వారా రూ.1,891.78 కోట్లు కేటాయించింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యూనిట్ల (పేపర్ ట్రయల్ మెషీన్లు) కొనుగోలు, వాడుకలో లేని ఈవీఎంల ధ్వంసం కోసం ఎన్నికల కమిషన్కు ఈ నిధులు కేటాయించారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కొత్త ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు. లైఫ్టైం పూర్తయిన ఈవీఎంలు, పాడైపోయిన వాటిని మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలను 2004 నుంచి నాలుగు లోక్సభ, 139 అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు.