నాలుగు దేశాలతో కొత్త గ్రూప్ ఐ2యూ2

నాలుగు దేశాలతో కొత్త గ్రూప్ ఐ2యూ2

వాషింగ్టన్: ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈతో పాటు అమెరికా భాగస్వామ్యంతో ఐ2యూ2 అనే సరికొత్త గ్రూప్​ ఏర్పడింది. ఈ గ్రూప్​ జులైలో వర్చువల్​ మీటింగ్​కు సిద్ధం అవుతున్నట్టు వైట్​హౌస్​ అధికారులు తెలిపారు. అమెరికా అలయన్స్​గా ఉన్న ఈ గ్రూప్​ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయాలనే ఆలోచనలతో బైడెన్​ చర్యలు తీసుకుంటున్నారు. ఈ గ్రూప్​లో భాగంగా ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, ఇజ్రాయెల్​ పీఎం  నెఫ్తాలీ బెన్నెట్​తో పాటు యూఏఈ ప్రెసిడెంట్​మహ్మద్ ​బిన్ ​జాయేద్​లు తొలిసారి వర్చువల్​గా మీట్​అవుతున్నారు. వరల్డ్​వైడ్​గా నెలకొన్న ఫుడ్​ క్రైసిస్​, సెక్యూరిటీ, కరోనా పరిస్థితులు, క్లైమేట్ ​చేంజ్​తో పాటు మేజర్​ ప్రాబ్లమ్స్​పై చర్చిస్తారని వైట్​హౌస్​​ తెలిపింది. జులై 13 నుంచి 16 మధ్య బైడెన్​ మిడిల్​ ఈస్ట్​లో పర్యటించనున్నారని, ఇదే సమయంలో ఈ వర్చువల్​ మీటింగ్​ ఉంటదని ప్రకటించింది. మోడీ, మహ్మద్​ బిన్ జాయేద్​తో పాటు బెన్నెట్​తో కలిసి ముందుకు వెళ్లాలని బైడెన్ ​నిర్ణయించినట్టు తెలిపింది. మూడు దేశాలూ టెక్నాలజీ హబ్​గా అభివృద్ధి చెందుతున్నాయని, ఇండియాలో మంచి కన్జూమర్​ మార్కెట్​ఉందని, హైటెక్​ ఎక్విప్​మెంట్ ​తయారు చేయడంలో నాలెడ్జ్ ​ఉందని వైట్​హౌస్​ వివరించింది. ఇండియాతో కలిసి పనిచేసేందుకు జో బైడెన్​ ఆసక్తి చూపుతున్నారని యూఎస్​ స్టేట్​ డిపార్ట్​మెంట్​ ప్రతినిధి నెడ్​ ప్రైస్​ తెలిపారు. బయో టెక్నాలజీ డెవలప్​మెంట్​కూడా మెయిన్​ ఎజెండా అని, మూడు దేశాలతో వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించారని చెప్పారు.