దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కొత్త రూల్స్​

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కొత్త రూల్స్​

మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి బ్రిడ్జిపై వెహికల్స్​ఆపడం, రీల్స్​చేయడం, ఫొటోలు దిగడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్​డీసీపీ డా.వినీత్​హెచ్చరించారు. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకి సూసైడ్​చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. అలాగే కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతూ.. రీల్స్ చేస్తూ చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో సైబరాబాద్​పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.