గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏపీలోని కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలా భాగం షూట్ చేశారు మేకర్స్. ఆదివారం నుంచి కొత్త షెడ్యూల్ను మంగళూరులో మొదలుపెట్టినట్టు తెలియజేశారు.
మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ సాంగ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఇతర కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.