వినాయక చవితికి కొత్త బిల్డింగ్లో సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ప్రత్యేక సెషన్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు నుంచి పార్లమెంట్ కొత్త బిల్డింగ్లో స్పెషల్ సెషన్ కొనసాగనుంది. వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సభ్యులు కొత్త బిల్డింగ్లోకి ప్రవేశించనున్నారు. పార్లమెంట్ స్టాఫ్ ఇకపై కొత్త యూనిఫాం ధరిస్తారు. నెహ్రూ జాకెట్స్, ఖాకీ కలర్ ప్యాంట్లు వేసుకోనున్నారు.
ఈ యూనిఫాంను నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్టీ) రూపొందించింది. బ్యూరోక్రాట్స్ సూట్ను డీప్ పింక్ కలర్ నెహ్రూ జాకెట్ భర్తీ చేయనుంది. స్టాఫ్ షర్టులు కూడా కమలం డిజైన్తో పింక్కలర్లో ఉండనున్నాయి. మార్షల్స్ మణిపురి తలపాగాలు ధరించనున్నారు. పార్లమెంట్బిల్డింగ్ సెక్యూరిటీ సిబ్బంది సఫారీ సూట్లకు బదులు మిలిటరీ మాదిరి డ్రెస్ వేసుకుంటారు