నాగ్ పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 టీ20 మ్యాచ్ ల్లో భాగంగా ఇది తొలి టీ20. వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా కివీస్ పై టీ20ల్లో నెగ్గి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అంతేకాదు స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని చూస్తుంది.
మరోవైపు వన్డే సిరీస్ ఇచ్చిన జోష్ తో న్యూజిలాండ్ టీ20 సిరీస్ లోనూ ఇండియాకు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. వరల్డ్ కప్ ముందు ఇరు జట్లకు ఇదే చివరి సిరీస్. జనవరి 21 నుంచి జనవరి 31 వరకు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టును మిచెల్ సాంట్నర్ లీడ్ చేయనున్నాడు. ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లకు చోటు దక్కలేదు.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):
టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ
భారత్ (ప్లేయింగ్ XI):
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
