
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ కేసులో నేషనల్హ్యూమన్రైట్స్కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) మరోసారి పోలీసులపై సీరియస్ అయ్యింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని గురువారం సిటీ సీపీ సీవీ ఆనంద్కు నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి (39) చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనపై జనవరిలో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అప్పుడే పూర్తి నివేదిక ఇవ్వాలని చిక్కడపల్లి ఏసీపీకి, జోన్ డీసీపీకి కమిషన్నోటీసులు ఇచ్చింది. అయితే, పోలీసులు ఇచ్చిన రిపోర్టులో సరైన వివరాలు లేవని మొట్టికాయలు వేసింది. అల్లు అర్జున్వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి చెప్పగా.. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ దగ్గర డీజేలు పెట్టి, హంగామా చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.
తొక్కిసలాట పోలీసుల లాఠీచార్జి వల్ల జరగలేదని.. అల్లు అర్జున్ రావడం వల్లే జరిగిందని పోలీసులు రిపోర్టులో పేర్కొనగా.. దానికి స్పందిస్తూ.. అనుమతి నిరాకరించినప్పుడు షో టైంలో అల్లు అర్జున్ ఎలా వచ్చాడని, అంతమంది గుమిగూడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు అర్థమవుతోందని, తమకు ఇచ్చిన రిపోర్టులో కూడా సరైన వివరాలు లేవని కమిషన్ పేర్కొన్నది. అందుకే మరోసారి నేరుగా సీపీ సీవీ ఆనంద్కు నోటీసులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికైనా ఘటనపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.