ఐటీ షేర్ల దూకుడుతో లాభాలు.. వరుసగా ఐదో రోజూ ర్యాలీ

ఐటీ షేర్ల దూకుడుతో లాభాలు.. వరుసగా ఐదో రోజూ ర్యాలీ
  • సెన్సెక్స్ 213 పాయింట్లు అప్​
  • 69 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ

ముంబై: ఐటీ, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. వరుసగా ఐదో రోజూ ఇన్వెస్టర్లను మురిపించాయి. 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్​ 213.45 పాయింట్లు పెరిగి 81,857.84 వద్ద స్థిరపడింది. ఇందులో 15 షేర్లు లాభాల్లో ముగియగా, మిగిలినవి నష్టపోయాయి. ఇంట్రాడేలో 341.23 పాయింట్లు పెరిగి 81,985.62ను తాకింది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగిసి 25,050.55 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్​ కంపెనీల్లో, ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.88 శాతం పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (2.69 శాతం) ఉంది. హిందుస్తాన్ యూనిలివర్, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్​ లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ట్రెంట్​ నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అర శాతం పడిపోవడం ప్రధాన సూచీల్లో లాభాలకు అడ్డుకట్ట వేసింది.

జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్​ వినోద్ నాయర్ మాట్లాడుతూ, "బలమైన దేశీయ పెట్టుబడులు, అనుకూలమైన ఆర్థిక అంశాల కారణంగా భారత మార్కెట్ సానుకూల వృద్ధిని కొనసాగించింది. అయితే, అమెరికా సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షల వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా వాణిజ్య విధానం, రాబడి వృద్ధిపై స్పష్టత రావడం చాలా ముఖ్యం. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఓఎంసీ మినిట్స్ విడుదల నేపథ్యంలో గ్లోబల్​ మార్కెట్లు జాగ్రత్తగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు జెరోమ్ పావెల్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన భవిష్యత్తు విధానాలపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు" అని అన్నారు.

బీఎస్​ఈ రంగాల సూచీలు ఇలా..
బీఎస్​ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ 0.39 శాతం, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పెరిగాయి. బీఎస్​ఈ రంగాల సూచీల్లో, బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ 2.70 శాతం, ఐటీ 2.61 శాతం, టెక్ 2.22 శాతం, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ 1.36 శాతం, రియల్టీ 1.04 శాతం, టెలికమ్యూనికేషన్ 0.68 శాతం లాభపడ్డాయి. బ్యాంకెక్స్, ఆయిల్ అండ్​ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ నష్టాలను చవిచూశాయి.

ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ నష్టాల్లో ముగియగా, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభాలతో ముగిశాయి. యూరప్​ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు ఎక్కువగా నష్టాల్లో ముగిశాయి.  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు మంగళవారం రూ. 634.26 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.14 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌ ధర 66.54 డాలర్లకు చేరుకుంది.