డిసెంబర్ నాటికి 26,889 స్థాయికి నిఫ్టీ..పీఎల్ క్యాపిటల్ రిపోర్ట్

డిసెంబర్ నాటికి 26,889 స్థాయికి నిఫ్టీ..పీఎల్ క్యాపిటల్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు:  బ్రోకరేజ్ సంస్థ పీఎల్​  (ప్రభుదాస్​ లీలాధర్​) క్యాపిటల్ నిఫ్టీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 26,889 స్థాయి చేరవచ్చని ప్రకటించింది.  ఫార్మాస్యూటికల్స్, కొన్ని కన్స్యూమర్ స్టేపుల్స్, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్,  పవర్ వంటి  రంగాల పనితీరు బాగుంటుందని అంచనా వేసింది. 

దీని రిపోర్ట్​ ప్రకారం..ఈ రంగాలు మార్కెట్ ర్యాలీ  తదుపరి దశకు నాయకత్వం వహిస్తాయి. ప్రపంచ అనిశ్చితులు, టారిఫ్ యుద్ధాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ నిలదొక్కుకుంటున్నది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో ప్రభుత్వ ముందస్తు మూలధన వ్యయం భారీగా ఉంది.  

రిజర్వు బ్యాంకు రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లకు మేలు చేస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి తగ్గింపు లిక్విడిటీని, క్రెడిట్​గ్రోత్​ను పెంచుతుంది. సాధారణ వర్షపాతం,  ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం,  ఆదాయపు పన్ను ఉపశమనం వంటి అంశాలు కూడా మార్కెట్లకు మేలు చేస్తాయని పీఎల్ ​క్యాపిటల్​ రిపోర్ట్​ పేర్కొంది.