ఈజీఎస్​ పనులను పరిశీలించిన ఎన్ఐఆర్డీ టీమ్

ఈజీఎస్​ పనులను పరిశీలించిన ఎన్ఐఆర్డీ టీమ్

ఆమనగల్లు, వెలుగు: మాడుగుల మండలంలో చేపట్టిన ఈజీఎస్​ పనులను మంగళవారం ఎన్ఐఆర్డీ టీమ్​ పరిశీలించింది. 30 మంది సభ్యుల బృందం మండలంలోని అప్పారెడ్డిపల్లి, దొడ్ల పహాడ్, కొల్కులపల్లి గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఈజీఎస్​ అమలు తీరు, సామాజిక తనిఖీ, గ్రామసభ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ పద్మా రెడ్డి, సర్పంచులు అనురాధ, పద్మ, విజయ, డీఆర్డీవో ప్రభాకర్, ఏపీడీలు సక్రియా నాయక్, చరణ్  గౌతమ్, ఎంపీడీవో రాఘవులు, ఏపీవో నర్సింగ్, చీఫ్  విజిలెన్స్  ఆఫీసర్ ఉష, అసిస్టెంట్  విజిలెన్స్ ఆఫీసర్​ కొండయ్య పాల్గొన్నారు.