హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. రాష్ట్రంలో నిధులు, అధికారాన్ని దోచుకునే పనిలో బిజీగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. రాష్ట్రాన్ని దోచుకోవడంలో… ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారన్నారు . రాష్ట్ర ప్రజలంతా కరోనాతో అల్లాడుతోంటే సీఎం మాత్రం.. తన 7 స్టార్ ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకున్నారని ఆరోపించారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని, తెలంగాణలో నిజాం సర్కార్ ఉందన్నారు.
సచివాలయంలో ఎవరూ ఉండరని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లో తరుణ్ చుగ్ పర్యటించారు. రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, రాజాసింగ్, వివేక్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.