నిజామాబాద్, వెలుగు : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా ముగియడానికి 1,384 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాలూరా, ఖండ్గావ్, పోతంగల్ బార్డర్ విలేజ్ల్లో 24/7 నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నామన్నారు. ఐదుగురికి మించి గుమికూడడానికి వీలులేదన్నారు.
ఇప్పటి వరకు రూ.2.57 లక్షల లిక్కర్ పట్టుకున్నామని, 183 మందిని బైండోవర్ చేశామన్నారు. బ్యాంకులు మినహాయించి నాలుగు లైసెన్స్ గన్స్ డిపాజిట్ చేయించామని తెలిపారు. పోలీస్ ప్రజావాణికి 24 ఫిర్యాదులుకమిషనరేట్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 24 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య బాధితులతో మాట్లాడి స్వయంగా వాటిని స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత ఠాణా ఎస్హెచ్వోలతో మాట్లాడి సూచనలు ఇచ్చారు. కేసులు నమోదు చేయాల్సిన తీరును వివరించారు.

