
నిజామాబాద్, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9లోపు లెసెన్స్వెపన్స్ కలిగి ఉన్న వారు స్థానిక పోలీస్స్టేషన్స్లో అప్పగించాలని సీపీ సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కోడ్ అమలులో ఉండగాఎవరూ రివాల్వర్, గన్ కలిగి ఉండడానికి వీలులేదని తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
అర్ధరాత్రి నగరంలో తనిఖీలు..
నగరంలో సోమవారం అర్ధరాత్రి సీపీ సాయిచైతన్య తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, శివాజీనగర్, కంఠేశ్వర్, దేవీరోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ఇచ్చి పంపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.