నిజామాబాద్, వెలుగు: ర్యాగింగ్కు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, సైబర్క్రైమ్అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సైబర్ నేరాలు, సోషల్మీడియా పట్ల అలర్ట్గా ఉండాలన్నారు.
డ్రగ్స్గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబర్1908కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఏసీపీ బి.ప్రకాశ్, ఆర్ఎన్సీసీ డీఎస్పీ సోమనాథం, ఈగిల్సెల్ఏసీపీ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.

