ఆర్మూర్, వెలుగు: ఈ నెల 10, 11,12వ తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్గర్ల్స్హాకీ పోటీల్లో పాల్గొనే నిజామాబాద్జిల్లా జట్టును మంగళవారం ఆర్మూర్లో ఎంపిక చేశారు. మినీ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్స్ లో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ కనబరిచిన 18 మందితో కూడిన ఫైనల్జట్టును ఎంపిక చేశారు.
చీఫ్గెస్ట్గా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గోనె లహరి, వైస్ చైర్పర్సన్ కాట్పల్లి వెంకటరెడ్డి హాజరై ఎంపికైన జట్టును అభినందించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, కౌన్సిలర్ సోను, ఫిజికల్ డైరెక్టర్స్ నాగేశ్, సంతోష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
